Tuesday, 10 July 2012



మే 1 
¤ 2012లో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ రేటు పెరిగి 202 మిలియన్లకు చేరుకుంటుందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) విడుదల చేసిన 'ప్రపంచ పని నివేదికలో పేర్కొంది
మే 3 
¤ గ్రామీణ, పట్టణ ప్రజల తలసరి ఆదాయం, ఖర్చులపై జులై 2009 - జూన్ 2010 మధ్య జాతీయ శాంపిల్ సర్వే సంస్థ (ఎన్ఎస్ఎస్ఓ) నిర్వహించిన సర్వేను విడుదల చేశారు
.
సర్వేలోని ముఖ్యాంశాలు
:
     » దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సరాసరి నెల ఖర్చు రూ.1054 (రోజుకు రూ.35). పట్టణ, నగర ప్రాంతాల్లో అది రూ.1984 (రోజుకు రూ
.66).
     » గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత దిగువస్థాయిలోని 10శాతం మంది నిరుపేదలు రోజుకి రూ.15 (నెలకు రూ.453) ఖర్చు చేస్తుంటే, పట్టణ పేదలు రోజుకి రూ.20 (నెలకు రూ.599) తో బతుకు వెళ్లదీస్తున్నారు
.
     » గ్రామీణ ప్రాంతాల్లో నెలకు తలసరి వినియోగ ఖర్చు (ఎంపీసీఈ)లో బీహార్, చత్తీస్‌గఢ్ రూ.780తో వెనుకబడి ఉన్నాయి. వాటికంట్ కాస్త మెరుగైన స్థానంలో ఒడిశా, జార్ఖండ్ ఉన్నాయి.(రూ.820).
     » గ్రామీణ ఎంపీసీఈలో కేరళలో అత్యధికంగా నెలకు రూ.1835, పంజాబ్‌లో రూ.1649, హర్యానాలో రూ.1510 ఖర్చు చేస్తున్నారు
.
     » పట్టణ ఎంపీసీఈలో రూ. 2437తో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో కేరళ (రూ. 2413), హర్యానా (రూ. 2321) ఉన్నాయి. రూ. 1238 ఖర్చుతో బీహార్ అట్టడుగున ఉంది.
     » ఆహారంపై గ్రామీణ ప్రాంతాల్లో 57 శాతం, పట్టణాల్లో 44 శాతం ఖర్చు చేస్తున్నారు
.
     » గ్రామాల్లో తృణధాన్యాల వినియోగం నెలకు 11.3 కేజీలు ఉంటే, నగరాల్లో అది 9.4 కేజీలుగా ఉంది
.
     » ఎన్ఎస్ఎస్ఓ అంచనాల ఆధారంగానే ప్రణాళికా సంఘం 2009-10లో దారిద్య్రరేఖను నిర్ధారించింది. పట్టణ ప్రాంతాల్లో అది రూ. 28.65 వద్ద, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 22.42 వద్ద ఉన్నట్లు పేర్కొంది
.
     » ప్రణాళికా సంఘం అంచనాల ప్రకారం 2009-10లో 35.46 కోట్లమంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. 2004-05లో ఈ సంఖ్య 40.72 కోట్లు. 
మే 8 
¤ 'అంతర్జాతీయ వయసు, పెద్దల ఆరోగ్యంపై అధ్యయనం' పేరిట అమెరికా గణాంక విభాగం నిర్వహించిన సర్వే ప్రకారం 2050 నాటికి భారతదేశ మొత్తం జనాభాలో మూడోవంతు మంది 50 ఏళ్లకు పైబడినవారు ఉంటారు.
     » 2010 భారత జనాభా లెక్కల ప్రకారం దేశంలో 50 ఏళ్ల వయసువారు 19.18 కోట్లమంది ఉన్నారు. మొత్తం జనాభాలో ఇది 16.4 శాతం.
     » 2020 నాటికి ఇది 20 శాతానికి (26.49 కోట్లు), 2050 నాటికి 32.6 శాతానికి (54.04 కోట్లు) చేరుతుంది. 
మే 16
¤ 1990-2010 మధ్య మాతృ మరణాల ధోరణిపై ఐరాస జనాభా నిధి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐరాస బాలల నిధి, ప్రపంచ బ్యాంకు కలిసి ఒక నివేదికను విడుదల చేశాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు:
     » ప్రపంచవ్యాప్తంగా 2010లో 2,87,000 మంది గర్భిణులు మరణించారు. 1990తో పోలిస్తే ఇది 47% తక్కువ.
     » 2010లో భారత్‌లో 56,000 (19%), నైజీరియాలో 40,000 (14%) మాతృ మరణాలు చోటుచేసుకున్నాయి.
     » కాంగో (15 వేలు), పాకిస్థాన్ (12 వేలు), సూడాన్ (10 వేలు), ఇండోనేషియా (9 వేలు), టాంజానియా (8,500), బంగ్లాదేశ్ (7,200), అఫ్గనిస్థాన్ (6,400) మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.
     » మొత్తం 180 దేశాల్లో సర్వే నిర్వహించారు. మాతృ మరణాల సూచి 154 దేశాల్లో తగ్గితే 26 దేశాల్లో పెరిగింది.
     » మాతృ మరణాల సూచిలో తగ్గుదల సాధించిన తొలి అయిదు దేశాలు ఇస్తోనియా (95%), మాల్దీవులు (93%), రుమేనియా (84%), భూటాన్ (82%), ఈక్వటోరియల్ గినియా (81%).
     » ఈ దేశాలు 2015 లక్షిత సంవత్సరం కంటే చాలా ముందుగానే తగ్గుదలను సాధించడం విశేషం. 
మే 21
¤ టి.ఆర్. బాలు నేతృత్వంలో 31 మంది సభ్యులతో రైల్వేలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయీ సంఘం తన నివేదికను పార్లమెంటుకు సమర్పించింది.
     » రైల్వేస్టేషన్లు, రైళ్లలో సురక్షిత మంచినీరు అందుబాటులో లేకపోవడంపై స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.
మే 25
¤ నీల్సన్ - ఇండియా టుడే సంయుక్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలోని యూనివర్సిటీల్లో 2012 సంవత్సరానికి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 6వ స్థానం లభించింది.
     » దక్షిణాది రాష్ట్రాల యూనివర్సిటీల్లో ఓయూకి ప్రథమ స్థానం దక్కడం విశేషం
.
     » గత ఏడాది 6వ స్థానంలో ఉన్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఈ ఏడాది 9వ స్థానం దక్కింది.

No comments:

Post a Comment