Thursday, 19 July 2012

గ్రూప్-2 ఎ.పి. హిస్టరీకరెంట్ ఎగ్జామ్స్ కవరేజిpart - II : unit-IIIఆంధ్రప్రదేశ్ సామాజిక, రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన బ్రిటిష్ వలస పాలన ముఖ్యంగా మచిలీపట్నంలో ఆంగ్లేయులు వర్తక స్థావరాన్ని (1611)ఏర్పాటు చేయడం మొదలు 1947 వరకు జరిగిన ముఖ్యమైన సంఘటనలను ఈ యూనిట్లో పేర్కొనడం జరిగింది.
పరీక్ష కోణంలో ఈ యూనిట్ నుండి అత్యధిక ప్రశ్నలు రావటమే కాకుండా యూనిట్ 4 మరియు 5లను అర్థం చేసుకోవడానికి కూడా ఈ యూనిట్ సిలబస్ ఉపయోగ పడుతుంది. కాబట్టి అభ్యర్థులు 1857 తిరుగుబాటు ప్రభావం మొదలుకొని భారత జాతీయోధ్యమానికి సమాతరంగా ఆంధ్రలో జరిగిన సంఘటనలను చదవటం వల్ల పేపర్-1లోని భారతదేశ చరిత్రలో ‘భారత జాతీయోద్యమం’అంశానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలను సులభంగా గుర్తించవచ్చు.
ముఖ్యంగా సామాజిక, సాంస్కృతిక జాగృతికి సంబంధించిన ఉద్యమాలు, వాటి నాయకులు, అదే విధంగా ఆయా ఉద్యమాల యొక్క ఫలితాలు వంటి అంశాలకు సంబంధించిన ప్రశ్నలు తప్పనిసరిగా వస్తున్నాయి. కాబట్టి ఆ కోణంలో అభ్యర్థులు క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది.
జాతీయోద్యమంలో జరిగిన కీలకమైన ప్రతి సంఘటనలో పాల్గొన్న మొదటి, లేక ఏకైక ఆంధ్ర నాయకుని గూర్చిన ప్రశ్నలు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నందున అభ్యర్థులు విశిష్ఠమైన అంశాలను ఎక్కువసార్లు రివిజన్ చేయాల్సి ఉంటుంది.
1.బ్రిటిష్ వర్తకులు ఆంధ్ర ప్రాంతంలో గోల్కొండ రాజుల అనుమతితో మచిలీపట్నంలో తమ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న సంవత్సరం? ( )1. క్రీ.శ.1611 2. క్రీ.శ.1612
3. క్రీ.శ.1632 4. క్రీ.శ.1614
2.క్రీ.శ. 1756లో ఫ్రెంచ్‌సేనాని బుస్సీని అధికారం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నిజాం నవాబు? ( )1. నాసర్ జంగ్ 2. ముజఫర్ జంగ్
3. సలాబత్ జంగ్ 4. నిజాం-ఉల్- ముల్క్
3.క్రీ.శ.1757లో బొబ్బిలి కోటపై యుద్ధానికి ఫ్రెంచ్ వారిని ప్రోత్సహించిన విజయనగర రాజు? ( )1. తిరుమలరాయలు
2. మొదటి శ్రీరంగదేవరాయలు
3. రెండో వెంకటరాయలు
4. విజయరామరాజు
4.రాయలసీమలో రైతులకు ఉపయుక్తమైన రైత్వారీ విధానాన్ని అమలు జరిపి ప్రశంసలందుకున్నది.? ( )1. థామస మన్రో 2. డూప్లే
3. కౌంట్ డీ లాలీ 4. బుస్సీ
5.రాజధానిని ఔరంగబాద్ నుంచి హైదరాబాద్‌కు మార్చిన నిజాం నవాబు? ( )1. సలాబత్ జంగ్ 2. నిజాం ఆలీఖాన్
3. నాసర్ జంగ్ 4. ముజఫర్ జంగ్
6.1867లో నిజాం రాజాన్ని ‘జిలాబంది విధానాన్ని’ అనుసరించి 5 సుభాలుగా విభజించటం జరిగింది. అయితే ఈ విధానాన్ని ప్రవేశపెట్టినది? ( )1. సాలార్ జంగ్ -1 2. సాలార్ జంగ్ -2
3. మహబూబ్ ఆలీఖాన్ 4. సలాబత్ జంగ్
7.హైదరాబాద్‌లో వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించినది ? ( )1. నాసిరుద్దౌల 2. సాలార్ జంగ్-1
3. ముబారిజ్ ఉద్దౌల 4. కాశిం రజ్వీrachanalu8.1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును అణిచి వేయుట వల్ల బ్రిటిష వారి చేత ‘స్టార్ ఆఫ్ ఇండియా’గా పిలవబడ్డ నిజాం నవాబు? ( )1. సికిందర్ జా 2. నిజాం ఆలీఖాన్
3. నాసర్ జంగ్ 4. ఆప్జల్ ఉద్దౌల
9.భారతదేశంలో వెలస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిని అంగీకరించిన మొదటి పాలకుడు? ( )1. నిజాం ఆలీఖాన్ 2. సలాబత్ జంగ్
3. మహబూబ్ ఆలీఖాన్ 4. ఉస్మాన్ ఆలీఖాన్
10.ఆంగ్లేయుల పరిపాలనలో ప్రచురించబడిన తొలి ఆంధ్రపత్రిక? ( )1. దేశభిమాని 2. ఆంధ్రప్రకాశిక
3. సత్యదూత 4. కృష్ణపత్రిక
11.అత్యంత వివాదాస్పదమైన ఇల్బర్ట్ బిల్లు వివాదంపై బ్రిటిష్ వారు సంప్రదించిన ఏకైక తెలుగు వ్యక్తి? ( )1. కందుకూరి వీరేశలింగం 2. ఏనుగుల వీరాస్వామి
3. గిడుగు రామమూర్తి 4. రాజాగజపతిరావు
12.ఆంధ్రలో ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా ‘‘వీర గంథము తెచ్చినారము వీరుడెవ్వడో తెల్పుడీ’’ అన్న సుప్రసిద్ధ గీతం రచించినది? ( )1. రాచకొండ విశ్వనాథశాస్త్రి
2. త్రిపురనేని రామస్వామి
3. పానుగంటి లక్ష్మీనరసింహారావు
4. రాజాగజపతిరావు
13.సుప్రసిద్ధ దండియాత్రలో పాల్గొన్న ఆంధ్రుడు? ( )1. ముట్నూరి కృష్ణారావు 2.కొక్కొండ వెంకటరత్నం
3. ఎర్నేని సుబ్రహ్మణ్యం 4. అడవి బాపిరాజు
14.ఆంధ్ర ప్రాంతంలో ‘‘హోంరూల్ లీగ్’’ కు కార్యదర్శిగా పని చేసినది? ( )1. దుగ్గిరాల గోపాల కృష్ణయ్య
2. గాడిచర్ల హరిసర్వోత్తమరావు
3. కొండా వెంకటప్పయ్య
4. అయ్యదేవర కాళేశ్వరరావు
15.ఆంధ్ర సోషలిస్టు కాంగ్రెస్ పార్టీ స్థాపకుడు? ( )1. తెన్నేటి విశ్వనాథం
2. కోటగిరి వెంకటకృష్ణారావు
3. బ్రహ్మజ్యోస్యులు సుబ్రహ్మణ్యం
4. త్రిపురనేని రామస్వామి చౌదరి
16. అల్లూరి సీతారామరాజు మొగల్లులో జన్మించగా, సమాధిని నెలకొల్ప బడిన ప్రాంతం? ( )1. మొగల్లు
2. చింతపల్లి
3. కృష్ణదేవిపేట
4. రంపచోడవరం
17.పెదనందిపాడు ఉద్యమ నాయకుడైన పర్వతనేని వీరయ్య చౌదరికి గల బిరుదు? ( )1. దేశభక్త 2. ఆంధ్ర రత్న
3. ఆంధ్రబీష్మ 4. ఆంధ్ర శివాజీ
18.ఆంధ్రలో వందేమాతర ఉద్యమంలో భాగంగా బిపిన్ చంద్రపాల్ పర్యటనలో పాల్ ఉపన్యాసాలను తెలుగులో అనువదించినది?( )1. న్యాపతి సుబ్బారావు
2. ముట్నూరి కృష్ణారావు
3. పానుగంటి లక్ష్మీనరసింహరావు
4. కొమర్రాజు లక్షణరావుimppersons19.జపాను చరిత్రను తెలుగులోకి అనువదించినది? ( )1. ఆదిపూడి సోమనాధరావు 2. గుఱ్ఱం జాషువా
3. ఏటుకూరి నరసయ్య 4. శ్రీశ్రీ
20.ఆంధ్రలో వందేమాతర ఉద్యమ కాలంలో కోటప్పకొండ సంఘటనకు గాను మరణశిక్షకు గురైనది?( )1. రామచంద్రరావు
2. చిన్నపరెడ్డి
3. మల్లాది వెంకట సుబ్బారావు
4. కన్నెగంటి హనుమంతుడు
21.కందుకూరి వీరేశలింగం ‘హితకారిణి సమాజాన్ని’ స్థాపించిన సంవత్సరం? ( )1. 1919 2. 1909
3. 1908 4. 1901
22.హైదరాబాద్‌లో వెలువడిన మొదటి పత్రిక ‘గోల్కొండ పత్రిక’ కాగా, ఆ పత్రిక స్థాపకుడు ఎవరు? ( )1. దేవులపల్లి రామానుజారావు
2. ముట్నూరి కృష్ణారావు
3. గాజుల లక్ష్మీనరసుశెట్టి
4. సురవరం ప్రతాపరెడ్డి
23.ఈ క్రింది వానిలో తప్పుగా జతపరచినది? ( )1. నిమ్న జాతుల చరిత్ర జాలా రంగస్వామి
2. నవజీవనం వుండ్రు సుబ్బారావు
3. జీవనజ్యోతి మళ్ల వెంకటరత్నం
4. వీరభారతి ఉన్నవ లక్ష్మీనారాయణ
1. 1 మరియు 2 2. 1,2 మరియు 3
3. 4 4. పైవన్నీ
24.ఆది హిందూ సామాజిక సేవా సమాఖ్యను హైదరాబాద్‌లో స్థాపించినది? ( )1. కాశీనాథుని నాగేశ్వరరావు 2. భాగ్యరెడ్డివర్మ
3. జాలా రంగస్వామి 4. 1 మరియు 2patrika25.కేరళలో శ్రీనారాయణగురు స్థాపించిన ‘శ్రీనారాయణ ధర్మపరిపాలన యోగం’ అనే సంస్థ ఏ కులస్థుల సంస్కృతీ కరణకు ప్రముఖంగా తోడ్పడినది?( )1. తులు 2. నంబూద్రి
3. ఎజవా 4. నాయకర్లు
26.‘రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయం’ ఎక్కడ స్థాపించబడినది? ( )1. హన్మకొండ 2. కర్నూలు
3. హైదరాబాద్ 4. గుంటూరు
27.‘విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి’ స్థాపనలో ప్రముఖంగా కృషి చేసినది? ( )1. రామచంద్ర పిళ్లై
2. కొమర్రాజు లక్ష్మణరావు
3. రావిచెట్టు రంగారావు
4. శ్రీనాయని వెంకటరంగారావు
28.1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది? ( )1. రావి నారాయణరెడ్డి
2. మాడపాటి హనుమంతరావు
3. స్వామి రామానంద తీర్థ
4. రామకృష్ణదూత్answers29.‘ఆత్మగౌరవ ఉద్యమం’ బలపడటానికి ‘పెరియార్’గా ప్రసిద్ధి చెందిన ‘రామస్వామి నాయకర్’ ప్రారంభించిన వార పత్రిక? 1. ద్రవిడ కజగం 2. నిమ్నజాతుల చరిత్ర
3. సోషలిస్ట్ 4. కుడి అరసు ( )
30.జస్టిస్ పార్టీ మొదటి సమావేశానికి ‘పి.రామరాయనింగార్’ అధ్యక్షత వహించగా, ఈ సమావేశం ఎక్కడ జరిగినది?( )1. మద్రాస్ 2. కోయంబత్తూర్
3. రాజమండ్రి 4. నెల్లూరు
ఈ యూనిట్ నుంచి గత ఎగ్జామ్స్‌లో వచ్చిన ప్రశ్నలు
1.ఆంధ్రలో జరిగిన శాసనోల్లంఘనోద్యమంలో డిక్టేటర్‌గా నియమితుడైన నాయకుడు? గూప్-2, 2008)
1. కొండా వెంకటప్పయ్య ( 1 )
2. టంగుటూరి ప్రకాశం
3. దుగ్గిరాల గోపాల కృష్ణయ్య
4.ఎన్.జి.రంగా
2.నెల్లూరు జిల్లాలో జరిగిన జమిందారీ వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర వహించినది ఈ క్రింది వారిలో ఎవరు?
1. బెజవాడ గోపాలరెడ్డి ( 3 )
2. పొనకా కనకమ్మ
3. ఓరుగంటి వెంకటసుబ్బయ్య
4. వెన్నెలకంటి రాఘవయ్య నగూప్-2, 2008)
3.తెలుగు సాహిత్యంలో వీరేశలింగం రచించిన తొలి తెలుగు నవల? గూప్-2 2011)( 1 )1. రాజశేఖర చరిత్ర 2. లోకరంజని
3. సతీహిత బోధిని 4. రసికోల్లాసిని
4.భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి తెలుగు వాడెవరు? నగూప్-2, 2011) ( 2 )1. పి.సీతారామయ్య 2. పి.ఆనందాచార్యులు
3. టిపకాశం 4. ఎన్.సంజీవరెడ్డి
5.ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలుత ఏర్పడినపుడు దాని కార్యస్థానం ఎక్కడ ఉండేది? నగూప్-2, 2008)1. విశాఖపట్నం 2. బెజవాడ ( 2 )
3. గుంటూరు 4. మద్రా

No comments:

Post a Comment