Tuesday, 10 July 2012


మే 3 
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2012-13) సంబంధించి ద్రవ్య వినిమయ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. దీని ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి రూ.54 లక్షల కోట్లు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు చిక్కుతుంది.
     » ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టారు. 

¤ రసాయన ఆయుధాల బిల్లుకు సవరణలు చేపట్టడానికి ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది
.
మే 5
 ¤ కేంద్ర జలవనరుల మంత్రి పవన్కుమార్ బన్సల్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర ముఖ్యమంత్రులుఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డిపృథ్వీరాజ్ చవాన్ప్రాణహిత నీటి వినియోగ పర్యవేక్షణకుఅంతరాష్ట్ర మండలి ఏర్పాటుకుసంతకాలు చేశారు 
మే 7
¤ ఏడాది పాటు దేశ, విదేశాల్లో సాగిన రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది.
     » ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఠాగూర్ అంతర్జాతీయ పురస్కారాన్ని తొలిసారిగా సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్‌కు ప్రకటించారు. ఈ అవార్డు విలువ రూ. కోటి.  
     » ఈ సందర్భంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయానికి కేంద్ర ప్రభుత్వం రూ. 150 కోట్ల గ్రాంటు ప్రకటించింది.
¤ విదేశీ మదుపుదారులకు ఊరటనిస్తూ ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ జనరల్ యంటీ - అవాయిడెన్స్ రూల్స్ (జీఏఏఆర్ - 'గార్') అమలును ఏడాదిపాటు వాయిదా వేశారు.
     » పన్ను ఎగవేతను అరికట్టే లక్ష్యంతో 2012-13 బడ్జెట్‌లో గార్‌ను ప్రతిపాదించారు.
     » గార్ నిబంధనావళి 2013-14 ఆర్థిక సంవత్సరం, ఆపై సంవత్సరాల నుంచి అమలవుతుందని ఆర్థికమంత్రి ప్రకటించారు.
మే 8
¤ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం రెండోదశ అమల్లోకి వచ్చింది.
     » దేశంలోని వేర్వేరు ప్రాంతాల క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడానికి రెండోదశ ఉపాధి హామీ పథకాన్ని (ఎంఎన్ఆర్ఈజీఏ 2.0) రూపొందించారు.
     » ఇకపై ఎంఎన్ఆర్ఈజీఏ పనులను నీటి యాజమాన్యం, సాగునీరు, వరద నియంత్రణ, వ్యవసాయం, పశువుల పెంపకం, చేపలు పట్టడం, తీరప్రాంతాల పనులు, గ్రామీణ తాగునీరు, పారిశుద్ధ్యం తదితర విభాగాలకు విస్తరించనున్నారు. ఏయే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలనేది గ్రామసభల్లో ఆయా గ్రామ పంచాయతీలు నిర్ణయిస్తాయి.
మే 9
¤ అన్ని పాఠశాలల్లోనూ వికలాంగ బాలలకు ఉచిత నిర్బంధ విద్య అందించేందుకు ఉద్దేశించిన బిల్లు (విద్యా హక్కు సవరణ బిల్లు)ను లోక్‌సభ ఆమోదించింది.
     » రాజ్యసభ ఈ బిల్లును ఏప్రిల్ 24నే ఆమోదించింది.
మే 10
¤ సూక్ష్మ రుణసంస్థల పరిశ్రమ నియంత్రణకు సంబంధించిన 'సూక్ష్మ రుణ రంగ అభివృద్ధి, నియంత్రణ బిల్లు- 2011'ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
     » ఇకపై ఈ రుణసంస్థలు రిజర్వు బ్యాంక్ నియంత్రణలో పనిచేస్తాయి.
     » ఈ బిల్లు ప్రకారం రుణసంస్థలు రిజర్వు బ్యాంక్ వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. సొంత నికర నిధులు కనీసం రూ. 5 లక్షలు ఉండాలి. సూక్ష్మ రుణ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తారు.
మే 13
¤ పార్లమెంటు వజ్రోత్సవాల సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశమయ్యాయి (ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించారు).   
     » సాయంత్రం 5.30కు సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్ సమావేశంలో ప్రసంగించారు.
     » ఈ సందర్భంగా 1952 నాటి తొలి సభకు ప్రాతినిధ్యం వహించిన కందాళ సుబ్రహ్మణ్యం, కానేటి మోహనరావు (ఇద్దరూ తెలుగువారు), రేషమ్ లాల్ జంగ్డే, రిషాంగ్ కీషింగ్‌లను ఘనంగా సన్మానించారు.
     » రిషాంగ్ కీషింగ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు కావడం విశేషం.
     » కందాళ సుబ్రహ్మణ్యం విజయనగరం లోక్‌సభ స్థానానికి, కానేటి మోహనరావు రాజమండ్రి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.
     » 1952 మే 13న భారతదేశ సర్వసత్తాక పార్లమెంట్ తొలి సమావేశం నిర్వహించారు. తాత్కాలిక స్పీకర్ గణేష్ వాసుదేవ మౌలాంకర్ ఆధ్వర్యంలో తొలి భేటీకి అంకురార్పణ జరిగింది. మే 15, 1952న మౌలాంకర్‌ను తొలి స్పీకర్‌గా ఎన్నుకున్నారు.
     » రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పార్లమెంట్ వజ్రోత్సవాలకు చిహ్నంగా రూ. 5, రూ. 10 నాణేలను విడుదల చేశారు.
మే 16
¤ చక్కెర ఎగుమతి నిబంధనలను ప్రభుత్వం సరళీకరించింది. ఎగుమతి కోటాను 10 వేల టన్నుల నుంచి 25 వేల టన్నులకు పెంచింది.
మే 17
¤ దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కాపీరైట్ సవరణ బిల్లు - 2012కు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
     » కేంద్ర హెచ్ఆర్‌డీ మంత్రి కపిల్ సిబాల్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
మే 18
¤ అంతరాష్ట్ర మండలి స్థాయీ సంఘాన్ని పునర్ వ్యవస్థీకరించారు. హోం మంత్రి చిదంబరం దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
     » పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు అంతరాష్ట్ర మండలి స్థాయీ సంఘంలో సభ్యులుగా ఉంటారు.
మే 20
¤ ఇకపై కాబోయే వైద్యులు ఎంబీబీఎస్ పట్టా పొందే ముందు ఏడాది పాటు గ్రామీణ ప్రాంతంలో తప్పనిసరిగా పని చేయాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది.
     » గ్రామీణ ప్రాంతంలో పనిచేసే ఏడాది కాలంలో వైద్యులు జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం (ఎన్ఆర్‌హెచ్ఎం)తో అనుసంధానమై పని చేయాల్సి ఉంటుంది.
మే 21
¤ యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయ్యాయి.
¤ నల్లధనం నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. 97 పేజీల ఈ శ్వేతపత్రాన్ని ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
     » నల్లధనం నియంత్రణకు నాలుగంచెల వ్యూహాన్ని ఇందులో ప్రతిపాదించారు.
1. ఆస్తుల స్వచ్ఛంద వెల్లడికి వెనకంజ వేయించే అంశాలను తగ్గించడం 2. ఆర్థిక లొసుగులు ఉండే రంగాల్లో సంస్కరణలు 3. సమర్థమైన, విశ్వసనీయమైన నియంత్రణ చర్యలు 4. నియంత్రణలో వెన్నుదన్నుగా నిలిచే చర్యలు.
మే 22
¤ ఆనంద్ వివాహచట్టం సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. దీంతో సిక్కు మతస్థుల వివాహాల నమోదుకున్న చిక్కులు తొలగి పోయినట్లయ్యింది.
     » ఆనంద్ వివాహ చట్టం 1909లోనే రూపొందినా వివాహాల నమోదు (రిజిస్ట్రేషన్)కు సంబంధించిన నిబంధనను అందులో చేర్చలేదు. దీంతో సిక్కు మతస్థులు కూడా హిందూ వివాహ చట్టం- 1955ను అనుసరించే తమ వివాహాలను నమోదు చేసుకుంటూ, ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారు. దీంతో వారినీ హిందువులుగానే పరిగణించాల్సి వస్తోంది.
¤ 18 ఏళ్లలోపు పిల్లలకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది.
     » చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులను వేగంగా విచారించేందుకు ఈ చట్టం కింద ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తారు. దోషులకు జీవితఖైదు లాంటి కఠినమైన శిక్షలు విధిస్తారు.
¤ కాపీరైట్ సవరణ బిల్లు 2012కు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. రాజ్యసభ మే 17నే ఈ బిల్లును ఆమోదించింది.
     » పాటల రచయితలు, కళాకారులు, ప్రదర్శకులు ఇకనుంచి తమ సృజనకు రాయల్టీ (శాశ్వత చెల్లింపులు)లను పొందవచ్చు. ఇప్పటి దాకా నిర్మాతలే సృజనకు హక్కుదారులుగా ఉన్నారు.
¤ యూపీఏ-2 అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో 'రిపోర్ట్ టు ద పీపుల్ 2011-2012' నివేదికను ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ విడుదల చేశారు.
     » బ్రిక్స్ సదస్సులో దేశాధ్యక్షులతో ప్రధాని ఫోటో, చిరునవ్వుతో పంటచేలో పనిచేస్తున్న రైతు, బడిపిల్లలకు మధ్యాహ్న భోజనం, ఆధార్‌కార్డు, అగ్నిక్షిపణితో కూడిన ముఖచిత్రంతో 90 పేజీల నివేదికను విడుదల చేశారు.
మే 24
¤ పేదరికం అంచనాకు అనుసరించిన పద్ధతిపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలోప్రత్యామ్నాయ పద్ధతులను సూచించే నిమిత్తం ప్రభుత్వం ప్రముఖ ఆర్థికవేత్తప్రధానిఆర్థిక సలహా మండలి ఛైర్మన్ సి.రంగరాజన్ నేతృత్వంలో నిపుణుల బృందాన్నినియమించింది     » పేదరికాన్ని అంచనా వేయడానికి సురేష్ టెండూల్కర్ ప్రతిపాదించిన పద్ధతిని బృందం పునఃసమీక్షిస్తుంది     » సురేష్ టెండూల్కర్ పద్ధతి ప్రకారం - రోజువారీ వినియోగానికి పట్టణాల్లో రూ. 28.65, గ్రామాల్లో రూ. 22.42 చొప్పున ఖర్చు పెట్టగలిగేవారు మాత్రమేనిరుపేదలంటూ దారిద్య్రరేఖను స్థిరపరచడంతో విపక్షాలుప్రజల నుంచి తీవ్ర ఆగ్రహంవ్యక్తమైంది నేపథ్యంలో ప్రణాళికా సంఘం  కమిటీని ఏర్పాటు చేసింది     » టెండూల్కర్ కమిటీ సూత్రం ప్రకారం దేశంలో పేదరికం 2004-05లో 37.2శాతం ఉండగా 2009-10 నాటికి 29.8 శాతానికి తగ్గిందిపేదల సంఖ్య 40.7 కోట్లనుంచి 35.5 కోట్లకు తగ్గింది
మే 28
¤ ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీఉన్న 27 శాతం రిజర్వేషన్లలోమైనార్టీలకు 'ఉపకోటాకింద 4.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను కొట్టివేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది     » ఓబీసీ రిజర్వేషన్లను రెండు భాగాలుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం 2011డిసెంబరు 22 రెండు ఆదేశాలు విడుదల చేసిందిఓబీసీలకున్న 27 శాతంరిజర్వేషన్ల కోటాలో ఓబీసీలకు 22.5 శాతం మిగతా 4.5 శాతం సామాజిక,విద్యపరంగా వెనుకబడిన మైనార్టీలకు వర్తిస్తాయని స్పష్టం చేసింది
మే 31
¤ 1999 నాటి టెలికం విధానం స్థానంలో తీసుకురానున్న కొత్త టెలికం విధానం - 2012కు ప్రధాని మన్మోహన్ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందిదీనిప్రకారం రోమింగ్ ఛార్జీలు ఉండవుదేశంలో ఎక్కడ  నెట్‌వర్క్‌కు మారినా ప్రస్తుతంఉపయోగిస్తున్న నంబరునే ఉంచుకోవచ్చునంబర్ పోర్టబులిటీ ప్రక్రియను టెలికంవిభాగం తక్షణం ప్రారంభిస్తుందికొత్త టెలికం విధానంలోని ముఖ్యాంశాలు:      » దేశంలోని గ్రామీణా ప్రాంతాల్లో టెలికం సేవలు ప్రస్తుతం 39 శాతందీన్ని 2017నాటికి 70 శాతం, 2020 నాటికి 100 శాతం చేయాలన్నది లక్ష్యం     » అందరికీ బ్రాడ్‌బ్యాండ్బ్రాడ్‌బ్యాండ్ కనీస వేగం 2 ఎంబీపీఎస్‌కు పెంపుమార్పు తక్షణం అమల్లోకి     » మొబైల్‌ఫోన్లుఇతర టెలికం ఉపకరణాల తయారీ దేశంలోనే చేపట్టడం.భారత్‌ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మార్చడం     » స్పెక్ట్రమ్ చట్టం రద్దువిధాన రూపకల్పన అధికారం ప్రభుత్వం వద్దేటెలికంనియంత్రణ సంస్థ (ట్రాయ్ఎలాంటి విధానాలను రూపొందించదు
¤ ప్రవాస భారతీయ కార్మికుల కోసం మే 1 ప్రారంభించిన పింఛనుబీమా పథకంపేరును మహాత్మగాంధీ ప్రవాసి సురక్ష యోజనగా మార్చాలని ప్రభుత్వంనిర్ణయించిందివిదేశాల్లో వర్క్ పర్మిట్ లేదా ఉపాధి కాంట్రాక్టు ఉండిపాస్‌పోర్టులపై'ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వెర్‌డ్స్టాంప్ ఉన్న భారతీయ కార్మికులకు  పథకంవర్తిస్తుంది

No comments:

Post a Comment