Tuesday, 10 July 2012


ఏప్రిల్ 4
¤ మల్టీనేషనల్ డిజైన్ ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్ (ఎండీఈపీ) సంస్థలో నూతన సభ్యురాలిగా భారత్ చేరింది. ఈ సంస్థను అమెరికా, ఫ్రాన్స్ ప్రారంభించాయి. ఇందులో ఈ రెండు దేశాలతోపాటు కెనడా, చైనా, ఫిన్లాండ్, జపాన్, దక్షిణ కొరియా, రష్యా, దక్షిణాఫ్రికా, బ్రిటన్ దేశాలకు సభ్యత్వం ఉంది.
   » నూతన అణుశక్తి నమూనాకు సంబంధించి ఈ దేశాలు పరస్పరం సహకరించుకుంటాయి.
ఏప్రిల్ 6
¤ ప్రపంచంలో మొదటిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితోనే పారా మిలటరీ పైప్ బ్యాండ్ (సంగీత బృందం)ను ఏర్పాటుచేసిన ఘనతను కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్) దక్కించుకుంది.
   » దేశంలోని మూడు మహిళా సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ల నుంచి ఎంపిక చేసిన 22 మందితో ఈ సంగీత బృందం ఏర్పాటైంది.
   » 1986లో మహిళా సీఆర్‌పీఎఫ్ తొలి బెటాలియన్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మూడు దళాలు పనిచేస్తున్నాయి.
   » అన్ని కేంద్ర దళాలు, రాష్ట్రాల పోలీసు శాఖలకు ఉన్నట్లే సీఆర్‌పీఎఫ్‌కు కూడా పురుషుల బ్యాండ్ ఉంది.
   » సీఆర్‌పీఎఫ్ డీఐజీ - నీతూ భట్టాచార్య (మహిళా విభాగం)
   » సీఆర్‌పీఎఫ్ డీఐజీ - విజయ్‌కుమార్
ఏప్రిల్ 7
¤ 2010లో భారతదేశాన్ని సందర్శించిన పర్యటకుల వివరాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ముఖ్యాంశాలు:    » 2010లో ఆంధ్రప్రదేశ్ 15.57 కోట్ల మంది పర్యటకులను ఆకర్షించింది. దేశం మొత్తం మీద దేశీయ పర్యటకుల వాటాలో 21 శాతాన్ని కైవసం చేసుకుంది.
   » ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేసిన మొత్తం పర్యటకుల సంఖ్య 15.58 కోట్లు. ఇందులో 99 శాతం (15.57 కోట్లు) దేశీయ పర్యటకులే. వీరిలో అధికులు సందర్శించిన ప్రాంతం తిరుపతి.
   » తర్వాతి స్థానాలు హైదరాబాద్, విశాఖపట్నం.
   » మన రాష్ట్రాన్ని సందర్శించిన విదేశీ పర్యటకుల సంఖ్య 3,22,825.
   » 2009తో పోలిస్తే 2010లో మన రాష్ట్రాన్ని సందర్శించిన దేశీయ పర్యటకుల సంఖ్య 1.1% తగ్గింది. విదేశీ పర్యటకుల సంఖ్య 59.4 శాతం తగ్గింది.
   » దేశీయ సందర్శకుల సంఖ్యలో మన తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (14.6 కోట్లు), తమిళనాడు (11.44 కోట్లు), మహారాష్ట్ర (4.84 కోట్లు), కర్ణాటక (3.80 కోట్లు) ఉన్నాయి. ఈ అయిదు రాష్ట్రాల వాటా 67.4%; మన రాష్ట్ర వాటా 21%.
   » విదేశీ పర్యటకులను ఎక్కువగా ఆకర్షించింది మాత్రం మహారాష్ట్ర (50 లక్షలు). తర్వాత తమిళనాడు (28 లక్షలు), ఢిల్లీ (18 లక్షలు), ఉత్తరప్రదేశ్ (16 లక్షలు), బీహార్ (6 లక్షలు), ఆంధ్రప్రదేశ్ (3.22 లక్షలు).
   » మొత్తం మీద భారత్‌లో దేశీయ పర్యటకుల సంఖ్య 74.02 కోట్లు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే వృద్ధి 10.7 శాతం.
   » భారత్‌కు విచ్చేసిన విదేశీ పర్యటకుల సంఖ్య 1.78 కోట్లు. కిందటి ఏడాదితో పోలిస్తే వృద్ధి 24.2%.
   » విదేశీ పర్యటకుల రాకలో ప్రపంచంలో భారత్ వాటా 0.61%. ప్రపంచ పర్యటకంలో భారత్ స్థానం 40.
   » పర్యటకం కోసం 2011-12లో కేటాయించిన నిధులు రూ. 1100 కోట్లు.
   » 11వ పంచవర్ష ప్రణాళిక (2007-12)లో కేటాయించిన నిధులు రూ. 5156 కోట్లు.
   » ఆంధ్రప్రదేశ్‌కు 2011-12లో కేటాయించిన నిధులు రూ. 20.38 కోట్లు. 2010-11లో
రూ. 37.29 కోట్లు, 2009-10లో రూ. 109.89 కోట్లు కేటాయించారు.
ఏప్రిల్ 10
¤ దేశంలోనే తొలిసారి భారతీ ఎయిర్‌టెల్ సంస్థ కోల్‌కతాలో నాలుగోతరం (4జీ) సేవలను ప్రారంభించింది.
    » భారతీ ఎయిర్‌టెల్ సీఈఓ సంజయ్ కపూర్.
 
 ¤ భారత మొదటి జల వారోత్సవాలను ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రారంభించారు.  
ఏప్రిల్ 12
¤ ప్రైవేటు పాఠశాలలు పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను ఉచితంగా ఇచ్చి తీరాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా హక్కు చట్టానికి రాజ్యంగ గుర్తింపును సమర్థిస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ ప్రైవేట్, అన్ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలు పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను కేటాయించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే మైనార్టీ విద్యాసంస్థలకు దీన్నుంచి మినహాయింపు ఇచ్చింది.
¤ మతంతో సంబంధం లేకుండా వివాహ నమోదును (రిజిస్ట్రేషన్) తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనన మరణాల చట్టం, 1969లో సవరణ కోసం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుంది.
    » బాల్య వివాహాలను అరికట్టడానికి వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు, 18వ లా కమిషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
    » సిక్కుల వివాహాలను హిందూ వివాహ చట్టం కింద కాకుండా 'ఆనంద్ వివాహ చట్టం, 1909' కింద ప్రత్యేకంగా నమోదు చేయాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌ను కూడా కేంద్రం ఆమోదించింది. దీనికి సంబంధించిన బిల్లును కూడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం సిక్కులు, జైనులు, బౌద్ధుల వివాహాలను హిందూ వివాహ చట్టం కిందే నమోదు చేస్తుండటంతో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
¤ 2012-13 విద్యా సంవత్సరం నుంచి ఏఐసీటీఈ రెండు సరికొత్త మేనేజ్‌మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అందులో ఒకటి అయిదేళ్ల మేనేజ్‌మెంట్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం కాగా, ఇంకోటి బీటెక్, బీఆర్క్, బీఫార్మా డిగ్రీలతో కూడిన ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం. 12వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులందరూ ఈ రెండు కోర్సులకు అర్హులే.
¤ ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్‌సీ) ఉత్తరప్రదేశ్‌లో రూ. 10,000 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయతలపెట్టిన థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది.
    » ప్రతిపాదిత వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలును సుసాధ్యం చేసేందుకు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. దీన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్‌వర్క్ ఎస్‌పీవీ (జీఎస్‌టీఎన్ ఎస్‌పీవీ)గా వ్యవహరించనున్నారు. ఇది కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఐటీ సంబంధ మౌలిక సదుపాయాలను, సేవలను సమకూరుస్తుంది. దీన్ని రూ. 10కోట్ల మూల ధనంతో ఏర్పాటు చేస్తారు.
ఏప్రిల్ 13
¤ ఎంపీ ల్యాడ్స్ పథకం నుంచి వివిధ క్రీడా ప్రాజెక్టుల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడానికిప్రభుత్వం ఎంపీలకు అనుమతించింది.
   » పంచాయత్ యువ క్రీడా ఖేల్ అభియాన్ (పీవైకేకేఏ), అర్బన్ స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కీం(యూఎస్ఐఎస్పథకాలను ఎంపీ ల్యాడ్స్‌తో కలిపేందుకు  నిర్ణయం తీసుకున్నారు.
ఏప్రిల్ 19
¤  రైల్వే ఫ్లాట్‌ఫామ్ టికెట్ ధరను రూ. 3 నుంచి రూ. 5 కు పెంచాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
   » పెంచిన ధరలు మే 1 నుంచి అమల్లోకి వస్తాయి.
¤ అసోం శాసన సభ 75వ వార్షికోత్సవ సమావేశాన్ని గౌహతిలో నిర్వహించారు.
   » ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఏప్రిల్ 22
¤ ప్రపంచంలో భారీ టెలీస్కోప్ నిర్మాణ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరాలని భారత్ నిర్ణయించింది.ఇందుకోసం రూ. 700 కోట్లను అణుశక్తి శాఖ మంజూరు చేసింది   » అమెరికాలో నిర్మిస్తున్న  టెలీస్కోప్ ద్వారా స్పష్టమైన చిత్రాలుడేటాను పొందవచ్చు   » అమెరికాకెనడాజపాన్చైనాలకు  ప్రాజెక్టులో సభ్యత్వం ఉందిదీని నిర్మాణం 2019లోపూర్తవుతుందని భావిస్తున్నారు   » ప్రపంచంలో అతిపెద్దదైన హబుల్ టెలీస్కోప్ కంటే ఇది 10 రెట్లు ఎక్కువ శక్తిమంతమైంది
ఏప్రిల్ 24
¤ గిరిజన ప్రాంతాల్లోని కేంద్రీయ విద్యాసంస్థల్లో రాష్ట్రాల కోటా కింద ఎస్సీఎస్టీఓబీసీలకు రిజర్వేషన్కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది.
¤ 
రాజ్యసభ సభ్యులుగా 50 మంది ప్రమాణ స్వీకారం చేశారువీరిలో అరుణ్‌జైట్లీమాయావతి,విలాస్‌రావ్ దేశ్‌ముఖ్రాజీవ్ శుక్లాచిరంజీవిజయా బచ్చన్ మొదలైనవారు ఉన్నారు   » భాజపా నేత అరుణ్ జైట్లీని రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు.
ఏప్రిల్ 25
¤ పార్లమెంటు భద్రత కోసం 1500 మంది బలగాలతో ప్రత్యేక దళం ఏర్పాటుకు ప్రభుత్వంఆమోదించింది   » ప్రత్యేక శిక్షణ పొందిన సీఆర్‌పీఎఫ్ బలగాలతో 'పార్లమెంటు డ్యూటీ గ్రూప్పేరిట  దళంపార్లమెంటు ప్రాంగణంలో విధులు నిర్వహిస్తుంది
ఏప్రిల్ 26
¤ ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్)పై వడ్డీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం నుంచి 8.6శాతానికి పెంచుతున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది
ఏప్రిల్ 28
¤ 2011లో దేశ వ్యాప్తంగా పాముకాటు వల్ల 1440 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖప్రకటించింది   » అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 380 మంది పాము కాటు వల్ల చనిపోయారురెండోస్థానంలోఒడిశా (మృతులు సంఖ్య 296), మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ (258 మంది మృతులునిలిచాయి   » రేబిస్ వల్ల గతేడాది దేశ వ్యాప్తంగా 223 మంది చనిపోయారుఅత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 73మంది మరణించారుతర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ (45 మంది), ఒడిశా (24 మంది), తమిళనాడు (21మందికర్ణాటక (18 మందినిలిచాయి.

No comments:

Post a Comment