దేశంలోని యూనివర్సిటీల్లో, కాలేజీల్లో లెక్చరర్గా చేరేందుకు, విద్యా సంస్థల్లో పరిశోధనలు చేసేందుకు భారతీయులకు నెట్ ప్రధాన అర్హత. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) పేరుతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రతి సంవత్సరం రెండుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తుంది. నెట్లో అర్హత సాధించి యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో పరిశోధనలు చేసేందుకు ఆసక్తి చూపే వారికి యూజీసీ జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) అందజేస్తుంది. జాతీయ స్థాయిలో జరిగే నెట్ తీరుతెన్నులు, అర్హతలు తదితర అంశాల గురించి తెలుసుకుందాం.
| ||||
నెట్ ఎందుకు?
దేశంలో బోధన వృత్తిలోకి రావాలనే ఆసక్తి ఉన్న వారికి, విద్యా రంగంలో పరిశోధనలు చేయాలనుకునే వారికి కనీస ప్రమాణాలు ఉండాలనే కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) 1984లో తొలిసారిగా జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్)ను ప్రవేశపెట్టింది. అలాగే కేంద్ర ప్రభుత్వం 1988లో చేసిన సూచనలకు అనుగుణంగా లెక్చరర్షిప్నకు ప్రధానమైన అర్హతగా 1989లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)ను ప్రవేశపెట్టింది. యూజీసీకి చెందిన నేషనల్ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ బ్యూరో ఈ పరీక్షలను పర్యవేక్షిస్తుంది. నెట్ షెడ్యూలు: నెట్ను యూజీసీ ప్రతి సంవత్సరం జూన్, డిసెంబరు నెలల్లో నిర్వహిస్తుంది. నోటిఫికేషన్లను మార్చి, సెప్టెంబరు మాసాల్లో విడుదల చేస్తుంది. ఫలితాల వెల్లడి: జూన్లో నిర్వహించే నెట్ ఫలితాలను అక్టోబరులో, డిసెంబర్ నెట్ ఫలితాలను ఏప్రిల్లో వెల్లడిస్తారు. నెట్ సబ్జెక్టులు: ఇంగ్లిష్, తెలుగు, హిందీ, బెంగాలీ, మరాఠీ, లా, ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, ఫిలాసఫీ, హిస్టరీ, సోషియాలజీ, ఎడ్యుకేషన్, కామర్స్, కన్నడ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, తమిళ్, అరబిక్, లింగ్విస్టిక్స్, చైనీస్, నేపాలీ, మణిపురి, గుజరాతీ, ఫ్రెంచి, పర్షియన్, రాజస్థానీ, జర్మన్, జపనీస్, అడల్ట్ ఎడ్యుకేషన్/ కంటిన్యుయింగ్ ఎడ్యుకేషన్/నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇండియన్కల్చర్, లేబర్ వెల్ఫేర్/ పర్సనల్ మేనేజ్మెంట్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/ లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్/ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మొదలైనవి. ప్రధాన సైన్స్ సబ్జెక్టులైన కెమికల్ సైన్సెస్, ఎర్త్ అట్మాస్ఫియరిక్ ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్లకు సంబంధించిన నెట్ను కౌన్సిల్ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్)తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తారు. సీఎస్ఐఆర్- నెట్ నోటిఫికేషన్ను విడిగా జారీచేస్తుంది. అర్హతలు: ఏదైనా పీజీలో (హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్ సైన్స్ మొదలైనవి) కనీసం 55 శాతం మార్కులు పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. పీజీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా నెట్ రాయవచ్చు. పీహెచ్డీ డిగ్రీ ఉన్న వారికి అర్హత మార్కుల్లో సగటున 5 శాతం వరకు మినహాయింపు ఇస్తారు. అభ్యర్థి వయసు ప్రకటనలో పేర్కొనే తేదీ నాటికి 28 సంవత్సరాలు దాటకూడదు. ఇతరులకు నిబంధనలకు అనుగుణంగా సడలింపు ఉంటుంది. లెక్చరర్షిప్నకు గరిష్ఠ వయో పరిమితి నిబంధన లేదు. ఫీజు నిమిత్తం జనరల్ అభ్యర్థులు రూ.450, ఓబీసీలు రూ.225, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.110లను చలానా రూపంలో ఎస్బీఐలో చెల్లించాలి. ఈ కాపీని దరఖాస్తుకు జతచేసి పంపాలి. 2012 నుంచి నూతన పరీక్ష విధానం:
పేపర్ -1: ఇది జనరల్ పేపర్. అభ్యర్థికి టీచింగ్/ రిసెర్చ్లో ఎంత మేరకు ఆసక్తి ఉందనే విషయాన్ని గుర్తిచడమే ఈ పేపర్ ఉద్దేశం. ఇందులో రీజనింగ్ఎబిలిటీ, కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్లాంటి అంశాలపై 60 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థి మాత్రం 50 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది. పేపర్ -2: అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు ఆధారంగా 50 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. అన్నింటికీ సమాధానాన్ని గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. పేపర్ -3: ఇక్కడ కూడా అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టు ఆధారంగా 75 ప్రశ్నలు ఇస్తారు. అన్నింటికీ సమాధానాన్ని గుర్తించాలి. ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు. పైన పేర్కొన్న మార్కులను ఆయా పేపర్లలో విడివిడిగా పొందితేనే అర్హులుగా గుర్తిస్తారు. జేఆర్ఎఫ్కు, లెక్చరర్షిప్నకు, రెండింటికి కలిపి కటాఫ్ పాయింట్లను యూజీసీ నిర్ణయిస్తుంది. అర్హత గుర్తింపు ఎలా ఇస్తారు? * కేవలం జేఆర్ఎఫ్ కోరుకుంటున్నామా, లేదా లెక్చరర్షిప్ కోసమా, లేదా రెండింటి కోసమా అనేది అభ్యర్థి దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాలి. అభ్యర్థి దేని పరిధిలోకి వస్తాడనేదానికి దరఖాస్తులో చేసిన సూచనే ఆధారం. * అభ్యర్థి నెట్లోని మూడు పేపర్లలో చూపిన ప్రతిభ ఆధారంగా జేఆర్ఎఫ్ + లెక్చరర్షిప్ లేదా కేవలం జేఆర్ఎఫ్ లేదా లెక్చరర్షిప్నకు అర్హతను యూజీసీ నిర్ణయిస్తుంది. * లెక్చరర్షిప్నకు అర్హత పొందిన వారిని జేఆర్ఎఫ్ అవార్డుకు పరిగణనలోకి తీసుకోరు. జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్): అభ్యర్థి జేఆర్ఎఫ్కు అర్హత సాధిస్తే యూజీసీ వివిధ స్కీముల కింద ఇచ్చే ఫెలోషిప్ పొందడానికి కూడా అర్హులే. దీని పరిధి రెండు సంవత్సరాలు. అభ్యర్థికి జేఆర్ఎఫ్ అవార్డు లెటర్ జారీ చేసిన తేదీ నుంచి రెండు సంవత్సరాల వరకు తాను చేస్తున్న పరిశోధనలపై స్కాలర్షిప్లు పొందవచ్చు. నెట్ నుంచి మినహాయింపు: కాలేజీలు/ ఇన్స్టిట్యూషన్లు/ యూనివర్సిటీలలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేరాలంటే నెట్/ స్లెట్/ సెట్ కనీస అర్హతగా ఉండాలనేది ఒక నిబంధన. ఒకవేళ అభ్యర్థికి పీహెచ్డీ డిగ్రీ (యూజీసీ నిబంధనలకు అనుగుణంగా) ఉంటే వారిని నెట్/ స్లెట్/ సెట్ అర్హత నుంచి యూజీసీ మినహాయింపు ఇచ్చింది.
అభ్యర్థికి టీచింగ్, రిసెర్చ్ రంగంలో ఎంత మేరకు ఆసక్తి ఉందో తెలుసుకోవడమే ఈ పేపర్ ముఖ్య ఉద్దేశం. అభ్యర్థి ఏదైనా ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతున్నాడా, అవగాహనా శక్తి (కాంప్రహెన్షన్) ఎంత ఉంది?విశ్లేషణ తీరు ఎలా ఉంది? విషయ తార్కిక వాదనలు సరైన రీతిలో ఉన్నాయా లేదా అనే విషయాలను ఈ పేపర్ ద్వారా అంచనా వేస్తారు. ఇందులో... 1) టీచింగ్ ఆప్టిట్యూడ్, 2) రిసెర్చ్ ఆప్టిట్యూడ్ 3) రీడింగ్ కాంప్రహెన్షన్ 4) కమ్యూనికేషన్ 5) రీజనింగ్ 6) లాజికల్ రీజనింగ్ 7) డేటా ఇంటర్ప్రిటేషన్ 8) ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 9) పీపుల్ ఎన్విరాన్మెంట్ 10) హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్: గవర్నెన్స్, పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంశాలుంటాయి. ప్రిపరేషన్: ఈ సిలబస్ చాలా విస్తారమైనది. ప్రతి అంశం పైనా పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలి. సిలబస్ను క్రమ పద్దతిలో చదవాలి. కరెంట్ టాపిక్లపై విడిగా నోట్స్ రాసుకోవాలి. ప్రశ్నలను వేగంగా చదవడం, అర్థం చేసుకోవడం, సమాధానాన్ని త్వరగా గుర్తించడం బాగా అలవాటు చేసుకోవాలి. దీనికోసం ప్రతిరోజూ మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి. మల్టిపుల్ ప్రశ్న పత్రాలను ఎక్కువగా చేస్తూనే, సబ్జెక్టు ప్రాథమిక అంశాలపై పూర్తి పట్టు సాధించాలి. * ఈ పేపర్కు సంబంధించి మార్కెట్లో విభిన్న రకాల మెటీరియల్ దొరుకుతున్నా, ప్రామాణికమైన పుస్తకాలనే తీసుకోవాలి. ఒక సబ్జెక్టుకు సంబంధించి రకరకాల పుస్తకాలను చదవకూడదు. పేపర్ 2, 3: ఈ పేపర్లు అభ్యర్థి డిగ్రీ, పీజీలలో తాను చదివిన వాటినుంచి ఎంచుకున్నవి. కాబట్టి వీటిపై దరఖాస్తు నాటికే ఒక అవగాహన ఏర్పడి ఉంటుంది. ఈ విభాగాల్లో ప్రశ్నల సరళి చాలా లోతుగా ఉంటుంది. వార్షిక పరీక్షలకు చదివినట్లు ఇక్కడ చేయకూడదు. పోటీ పరీక్ష దృష్ట్యా చదవాలి. సబ్జెక్టులను ఒకటికి రెండు సార్లు రివిజన్ చేయాలి. నిర్ణీత సమయాన్ని కేటాయించాలి. రోజువారీ మాక్ టెస్టులతోపాటు వారానికి ఒక చాప్టర్ను పూర్తి చేయాలి. మాక్ టెస్టుల వల్ల అభ్యర్థికి వేగంగా చదవడం, అర్ధం చేసుకోవడం అలవడుతుంది. అంతేకాదు ఏ విభాగంలో తక్కువ మార్కులు వస్తున్నాయో, ఎక్కడ ఎక్కువ మార్కులు పొందగలుగుతున్నారో స్పష్టంగా తెలుస్తుంది. దీనికి అనుగుణంగా అభ్యర్థి తక్కువ మార్కులు వస్తున్న చాప్టర్లపై మరింత ఎక్కువ శ్రద్ధ చూపాలి. తద్వారా పరీక్షలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తించి మంచి స్కోర్ చేసి విజయం సాధించగలుగుతారు. ఆన్లైన్ అప్లికేషన్ దరఖాస్తు విధానం: * మొదట అభ్యర్థి యూజీసీ వెబ్సైట్నుంచి బ్యాంక్ చలానా డౌన్లోడ్ చేసుకోవాలి. ఏదైనా ఎస్బీఐ బ్రాంచ్లో పరీక్ష ఫీజు కింద నిర్ణీత మొత్తానికి చలానా రూపంలో ఫీజు చెల్లించి రశీదు పొందాలి. * ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయబోయే ముందు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను, ఫీజు రశీదును స్కానింగ్ చేయించాలి. * ఆన్లైన్రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అప్లికేషన్, అటెండెన్స్ స్లిప్, అడ్మిషన్ కార్డ్ తీసుకోవాలి. * ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తుకు తమ కుల ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి. * ప్రింట్ అప్లికేషన్కు తమ అర్హతలను తెలిపే అన్ని సర్టిఫికెట్ కాపీలను జతచేసి తాము ఏ వర్సిటీ పరిధిలోకి వస్తామో సంబంధిత వర్సిటీకి/ కాలేజీకి పంపాలి. * ఆన్లైన్ అడ్మిషన్ కార్డుపై ఫొటోను అతికించి పరీక్ష రోజున హాల్కు తీసుకురావాలి. వెబ్సైట్: http://oldwebsite.ugc.ac.in/inside/net.html తాజా యూజీసీ నెట్ (డిసెంబరు) సమాచారం: ప్రస్తుత 2012 సంవత్సరానికి డిసెంబరులో నిర్వహించనున్న నేషనల్ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)కు యూజీసీ ఇటీవల ప్రకటన జారీ చేసింది. * ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: నవంబరు 16. * ప్రింట్అవుట్ అప్లికేషన్ను పంపడానికి చివరి తేదీ: నవంబరు 22. * ప్రింట్అవుట్ అప్లికేషన్ను నేరుగా యూజీసీకి పంపకూడదు. తమ ప్రాంత వర్సిటీ కార్యాలయానికి పంపాలి. * పరీక్ష తేదీ: 2012 డిసెంబరు 30 |
Saturday, 10 November 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment